ETV Bharat / crime

కల్వర్టును ఢీకొన్న కారు... నలుగురు మృతి

author img

By

Published : Mar 9, 2021, 6:21 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్వర్టును కారు ఢీకొట్టడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి

ఏపీ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాసనగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మార్కాపురం ఆస్పత్రికి తరలించారు.

శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా... మేజర్ కాలువ దిమ్మెను బలంగా కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు, క్షతగాత్రులు గుంటూరు వాసులుగా గుర్తించారు.

ఇదీ చదవండి: హైటెన్షన్ కేబుల్​ పోల్​ను ఢీకొట్టిన టిప్పర్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.