ETV Bharat / crime

ట్రాలీ ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

author img

By

Published : Jun 5, 2022, 8:15 PM IST

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

Road Accident: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బాపునగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... మరో నలుగురికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Road Accident: నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం బాపునగర్‌వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అర్సపల్లికి చెందిన గంగాధర్‌ తన కుటుంబ సభ్యులతో ఎడపల్లికి ట్రాలీ ఆటోలో బయలుదేరారు. బాపునగర్ కల్వర్టు వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కంటైనర్‌ లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గంగాధర్‌ తలకు తీవ్రగాయలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి.. మరో నలుగురికి తీవ్ర గాయాలు

నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.