ETV Bharat / crime

బైక్​ను ఢీకొట్టిన డీసీఎం.. ఒకరు మృతి

author img

By

Published : Apr 20, 2021, 1:07 PM IST

road accident at wanaparthy district
బైక్​ను ఢీకొట్టిన డీసీఎం.. ఒకరు మృతి

వనపర్తి నుంచి రాజపేట వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని కొత్తకోట వైపు నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మరోకరికి గాయాలయ్యాయి.

వనపర్తి జిల్లా రాజపేట గ్రామానికి చెందిన మొగులయ్య అనే వ్యక్తి తన పనులు ముగించుకుని 9 గంటలకు సొంత గ్రామమైన రాజపేటకు తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నాగవరం తండా వద్ద కొత్తపేట నుంచి కోళ్ల లోడుతో వస్తున్న డీసీఎం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మొగులయ్య అక్కడిక్కడే మృతి చెందాడు మరోకరికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.