ETV Bharat / crime

రెండు లారీల ఢీ.. ఒకరు మృతి

author img

By

Published : Feb 21, 2021, 7:32 PM IST

road accident at marikal in narayanapeta district
రెండు లారీల ఢీ.. ఒకరు మృతి

రెండు లారీలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలం పసుపుల గేట్ సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

నారాయణపేట జిల్లా మరికల్ మండలం పసుపుల గేట్ సమీపంలో 167వ జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్​ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతుడు నల్గొండ జిల్లా గుర్రంపోడు గ్రామానికి చెందిన కోటేష్​గా గుర్తించారు. లారీలో పత్తిని కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తుండగా మాగనూరు ఇటుక బట్టీల నుంచి మరో లారీ ఎదురెదురుగా వచ్చి ఢీ కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: మాతృభాషలో బోధనతో దేశాభివృద్ధి: విద్యాసాగర్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.