ETV Bharat / crime

Died in train: అగ్నిపథ్ ఎఫెక్ట్​.. రైలులోనే మృతి చెందిన వ్యక్తి

author img

By

Published : Jun 18, 2022, 4:56 PM IST

అగ్నిపథ్ ఆందోళనలకు మరో ప్రాణం బలైంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండె జబ్బుతో మృతి చెందాడు. చికిత్స కోసం వస్తుండగా విశాఖకు వస్తుండగా రైలు నిలిపివేయడంతో తీవ్ర అస్వస్థతకు మరణించాడు. ఈ ఘటన ఏపీలో జరిగింది.

Died in train
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/18-June-2022/15593196_767_15593196_1655539427926.png

Agnipath effect on trains: అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో అర్ధాంతరంగా రైలును నిలిపివేయటంతో ఓ ప్రాణం పోయింది. అత్యవసర చికిత్స కోసం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ గుండె జబ్బు బాధితుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా కొత్తవలసలో చోటు చేసుకుంది.

రైలులోనే మృతి చెందిన వ్యక్తి

అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో కోర్బా నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎక్స్​ప్రెస్ రైలును రైల్వే అధికారులు విజయనగరం జిల్లా కొత్తవలసలో నిలిపివేశారు. అర్ధాంతరంగా రైలును నిలిపివేయటంతో ప్రయాణికులు విశాఖపట్నం చేరుకోడానికి బస్సులు, ఆటోలు ఆశ్రయించారు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా నహుపాడకు చెందిన గుండెజబ్బు ఉన్న వ్యక్తి జోగేష్ బెహరా(75) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అత్యవసరంగా విశాఖకు తరలించేందుకు స్థానికంగా ప్రైవేటు అంబులెన్సులు అందుబాటులో లేకపోవటంతో బాధితుడి కుటుంబ సభ్యులు కొత్తవలసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే జోగేష్ బెహరా మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇవీ చదవండి: 'సికింద్రాబాద్‌ అల్లర్లలో ప్రత్యక్షంగా రూ.12 కోట్ల ఆస్తినష్టం'

పెళ్లి టైంకి ప్రేయసికి హ్యాండ్ ఇచ్చిన ఎమ్మెల్యే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.