దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా... ఒకరి మృతి, 13 మందికి గాయాలు

author img

By

Published : Dec 25, 2021, 4:58 PM IST

Updated : Dec 25, 2021, 6:05 PM IST

road accident
road accident ()

16:55 December 25

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా... ఒకరి మృతి, 13 మందికి గాయాలు

Maruti Nagar Road Accident: జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం మారుతీనగర్ వద్ద జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడి ఒకరు మృతిచెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం కులాల్​పూర్ గ్రామానికి చెందిన వీరంతా... శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం ధర్మపురి వెళ్లారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ క్రమంలో ఆటో మారుతీనగర్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బోల్తా పడి మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో గంగాధర్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని మెట్​పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చూడండి:

Last Updated :Dec 25, 2021, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.