ETV Bharat / crime

నానమ్మ అంత్యక్రియల ఏర్పాట్లు చూస్తూ మనువడు మృతి

author img

By

Published : Nov 6, 2022, 1:12 PM IST

ఆ ఇంటిపై విధి కక్ష గట్టింది. గంటల వ్యవధిలో నానమ్మ, మనవడు మృతి చెందారు. నానమ్మ చనిపోయిందని అంత్యక్రియ ఏర్పాట్లలో భాగంగా బయటకు వెళ్లిన మనవడు.. శవమై ఇంటికి వచ్చాడు. పెద్దావిడ చనిపోయిందనే శోకంలో ఉన్న ఆ ఇంటికి.. కుమారుడు కూడా మరణించాడన్న వార్త.. ఆ కుటుంబాన్ని తల్లిడిల్లేలా చేసింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

Two deaths in the same family Anantapur district
Two deaths in the same family Anantapur district

అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉరవకొండ మండలం పెద్దకొట్టాలపల్లిలో ఒకే రోజు వ్యవధిలో నానమ్మ, మనువడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఒకేసారి ఇద్దరి అకాల మరణంతో ఆ కుటుంబ రోదనలు మిన్నంటాయి. ఇంటిి పెద్దావిడ పోయిందనే శోకంలో ఉన్న ఆ కుటుంబానికి చేతికొచ్చిన కుమారుడు కూడా చనిపోయాడన్న వార్తతో.. ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు.

ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉరవకొండ పెద్ద కొట్టాల పల్లికి చెందిన యల్లమ్మ(80) శనివారం మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు ఆదివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుర్చీలు, షామియానాను విడపనకల్లు నుంచి తెచ్చేందుకు మనువడు వంశీ (19) ఆటోలో బయలుదేరాడు. మాళాపురం వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. వంశీ ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఇవీ చదవండి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశాయి: కేఏ పాల్

3 ఎకరాలు విక్రయం.. 30 లక్షలు ఖర్చు.. ఆహార కల్తీపై అలుపెరుగని పోరాటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.