ETV Bharat / crime

చలి మంటల్లో వృద్ధురాలి సజీవ దహనం

author img

By

Published : Jan 28, 2021, 4:42 PM IST

old-woman-burned-alive-and-died-in-vizianagaram
చలి మంటల్లో వృద్ధురాలి సజీవ దహనం

చలికాలం కదా అని వెచ్చదనం కోసం ఆ వృద్ధురాలు చలిమంట వేసుకుంది. కాని పాపం.. అవే మంటలు అంటకుని సజీవ దహనం అయింది.

వెచ్చదనం కోసం వేసుకున్న మంటలే ఓ వృద్ధురాలి ప్రాణాలు తీశాయి. ఏపీలోని విజయనగరం జిల్లా వేపాడలో ఈ విషాదం చోటు చేసుకుంది. రోజూలాగే జోగులమ్మ అనే వృద్ధురాలు తన ఇంటి సమీపంలో.. వెచ్చదనం కోసం చలి కుంపటి వెలిగించింది.

చలి కాచుకుంటున్న ఆమెకు ప్రమాదవశాత్తు ఒంటికి నిప్పంటుకుంది. మంటలు ఆర్పడానికి చుట్టుపక్కల వారు ప్రయత్నించినప్పటికి ప్రయెజనం లేకపోయింది. మంటల్లోకాలి సజీవదహనం అయింది.

ఇదీ చదవండి: పందిని తప్పించబోయి ప్రమాదం: ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.