ETV Bharat / crime

విషాదం: కొడుకు కళ్లెదుటే.. తల్లి మృతి

author img

By

Published : May 30, 2021, 10:56 PM IST

accident
accident

ఏపీలోని గుంటూరు జిల్లా కాకుమాను వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్.. బైక్​ను ఢీకొన్న ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్.. బైక్​ను ఢీ కొన్న ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా కాకుమానులో చోటు చేసుకుంది. వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన మరియమ్మ.. కుమారుడితో కలిసి బైక్​పై ప్రకాశం జిల్లా వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

విగతజీవిగా పడి ఉన్నతల్లిని చూసి కుమారుడు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: Suicide: ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.