ETV Bharat / crime

బాత్‌రూం శుభ్రతపై దంపతుల తగాదా.. ఉరేసుకుని భార్య ఆత్మహత్య

author img

By

Published : Mar 24, 2022, 10:10 AM IST

Updated : Mar 24, 2022, 10:18 AM IST

దంపతుల మధ్య తలెత్తినా విభేదాల వల్ల క్షణికావేశానికిలోనై భార్య ఆత్మహత్యకు పాల్పడింది.ఈవిషయం తెలియని పిల్లలు నాన్న ఎందుకు ఏడుస్తున్నావంటూ అడిగిన ప్రశ్న అక్కడివారిని కంటతడి పెట్టించింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది

Wife commits suicide
భార్య ఆత్మహత్య

హైదరాబాద్​ బాత్‌రూం శుభ్రం విషయంలో దంపతుల మధ్య తలెత్తిన వివాదం గృహిణి బలవన్మరణానికి దారితీసింది.ఈ ఘటన కూకట్​పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శంకర్‌ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

Shruti
శృతి

కూకట్‌పల్లి న్యూబాలాజీ నగర్‌లో దాసరి శృతి (28), నవీన్‌ దంపతులు ఉమ్మడి కుటుంబంతో ఉంటున్నారు. వీరికి ఆరేళ్లు, ఏడాదిన్నర వయసున్న ఇద్దరు కుమారులున్నారు. శృతి గృహిణి కాగా నవీన్‌ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. మంగళవారం మధ్యాహ్నం నవీన్‌ బాత్‌రూంలో మూత్రవిసర్జన చేసి వచ్చారు. అయితే నీళ్లు ఎందుకు పోయలేదనే విషయమై ఆమె భర్తను ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. అవమానంగా భావించిన శృతి పైగదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకుని మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఇంటి వద్ద దిగబెడతానని కారులో ఎక్కించి.. టీచర్‌పై అత్యాచారం

Last Updated : Mar 24, 2022, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.