ETV Bharat / crime

చోరీ కేసును ఛేదించిన పోలీసులు

author img

By

Published : Feb 12, 2021, 8:42 PM IST

హైదరాబాద్​లోని ఆంధ్రాబ్యాంక్​ కాలనీలో గత నెల 29న వృద్ధురాలిని బెదిరించి నగలు దోచుకెళ్లిన కేసును మలక్​పేట్​ పోలీసులు ఛేదించారు. నిందితుల వద్ద నుంచి 13 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రమేష్ తెలిపారు.

malapert-andhra-bank-colony-theft-the-police-who-cracked-the-case
చోరీ కేసును ఛేదించిన పోలీసులు

మలక్​పేట్​లోని ఆంధ్రాబ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఇంజినీర్ భార్య గొల్ల పద్మావతి (74) అనే వృద్ధురాలిని కత్తితో బెదిరించి బంగారు గొలుసు, గాజులు దోచుకున్న అగంతుకుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అతడికి సహకరించిన ఓ యువతిని అదుపులోకి తీసుకుని వారివద్ద నుంచి 13 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రమేష్ తెలిపారు.

కొన్నేళ్ల క్రితం భర్త మృతి చెందడంతో గొల్ల పద్మావతి అనే వృద్ధురాలు మలక్​పేట్​లోని ఆంధ్రాబ్యాంక్ కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆ విషయాన్ని గమనించిన శాలివాహననగర్​లో ఉండే ప్రైవేటు ఉద్యోగి తాండ్ర రాజేష్​, అదే ప్రాంతంలో అద్దెకుంటున్న తన స్నేహితురాలు రజినితో కలిసి దోపిడీకి పథకం వేశారు. వారిద్దరూ గత నెల 29న గోడదూకి ఇంట్లో దూరారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కత్తితో బెదిరించి మెడలో ఉన్న 8 తులాల బంగారు గొలుసు, 5 తులాల చేతి గాజులు దోచుకుని పారిపోయారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. రాజేశ్​పై గతంలో పలు పోలీస్​ స్టేషన్ల పరిధిలో దొంగతనం కేసులు ఉన్నట్లు ​డీసీపీ రమేష్ తెలిపారు.

ఇదీ చదవండి: సన్​ ఇంటర్నేషనల్​ కళాశాల వైస్​ ప్రిన్సిపల్​, లెక్చరర్​ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.