ETV Bharat / crime

Fraud: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం.. నలుగురి అరెస్ట్​

author img

By

Published : Aug 20, 2021, 7:01 PM IST

Fraud: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం.. నలుగురి అరెస్ట్​
Fraud: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం.. నలుగురి అరెస్ట్​

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లాలో ఓ ముఠా భారీ మోసాలకు తెరలేపింది. నిరుద్యోగులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతోంది. నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నిరుద్యోగులే లక్ష్యంగా ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ ముఠా మోసాలకు పాల్పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓర్వకల్లు, ఆలూరు పీఎస్ పరిధిలో ఆరుగురు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు.

వీరిలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పరారైన మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ముఠాల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: Cyber Crime: కొడితే బ్యాంకుల్నే కొట్టాలి!.. సైబర్‌ నేరగాళ్ల నయా ఎత్తుగడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.