ETV Bharat / crime

ఏపీ టు హైదరాబాద్​ గంజాయి రవాణా.. ముగ్గురి అరెస్ట్

author img

By

Published : Jan 11, 2023, 7:52 PM IST

వరంగల్ జిల్లాలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖిల్లా వరంగల్ మండలం మామునూర్ వద్ద టాస్క్​ఫోర్స్ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు.

గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నర్సీపట్నం నుంచి హైదరాబాద్​కు కారులో తరలిస్తున్న 86 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.17.30 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నలుగురు నిందితుల్లో ఒకరు పరారీలో ఉండగా ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. వీరిపై గతంలోనూ పలు పోలీస్​స్టేషన్​లలో కేసులు ఉన్నాయని.. ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నట్లు వరంగల్ టాస్క్​ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.