ETV Bharat / crime

డబుల్​ బెడ్​ రూం ఇల్లు పేరుతో కార్పొరేటర్​ అనుచరుడి మోసం

author img

By

Published : Apr 12, 2021, 3:49 PM IST

డబుల్​ బెడ్​ రూం ఇళ్లు ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. రూ. 10 లక్షలు ఆమె నుంచి వసూలు చేశాడు. ఇల్లు ఏదని అడిగితే ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి వైరల్​ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి చెప్పుదెబ్బ తిన్నాడు. బాలానగర్​ పీఎస్​ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

corporator follower cheating
కార్పొరేటర్​ అనుచరుడి మోసం

డబుల్‌ బెడ్​ రూం ఇల్లు ఇప్పిస్తానని ఓ మహిళ నుంచి డబ్బులు తీసుకుని, ఆమె నిలదీయటంతో.. ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరించాడు ఓ కార్పొరేటర్ అనుచరుడు. అతడిని బాధిత మహిళ.. కార్పొరేటర్ కార్యాలయంలోనే చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా బాలానగర్ పోలీస్​ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

గౌతమీ నగర్​లో నివాసముండే సయ్యద్ అహ్మద్ బాలానగర్ కార్పొరేటర్ అనుచరుడిగా ఉంటున్నాడు. ఫిరోజ్ గూడకు చెందిన ఓ వివాహితతో అహ్మద్​కు ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. డబుల్‌ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానని చెప్పి.. ఆమె‌ నుంచి రూ.10 లక్షలు వసూలు చేశాడు. ఇల్లు ఇవ్వకపోవడమే గాక, డబ్బులు తిరిగి ఇవ్వకపోవటంతో ఆ మహిళ అహ్మద్​ను నిలదీసింది. ఈ శనివారం.. కార్పొరేటర్ కార్యాలయం వద్దకు వచ్చిన బాధితురాలు మరోసారి అహ్మద్​ను నిలదీయటంతో.. తనతో ఉన్న ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె అతడిని చెప్పుతో కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.