Crime: సంగారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

author img

By

Published : Aug 6, 2021, 3:10 PM IST

Updated : Aug 6, 2021, 5:17 PM IST

five-killed-in-road-accident-in-sangareddy-district
five-killed-in-road-accident-in-sangareddy-district ()

15:07 August 06

Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం, ఐదుగురు మృతి

Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం, ఐదుగురు మృతి

సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు సంగాయిపేటకు చెందిన లూకా, దీవెన, పద్మ, అంబదాస్, వివేక్ గా గుర్తించారు. 

మెదక్‌ జిల్లా సంగాయిపేట గ్రామానికి చెందిన పద్మ(30), అంబదాస్‌(40) దంపతుల కుమారుడు వివేక్‌(6) అనారోగ్యానికి గురి కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు.  

అనంతరం స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. చౌటకూర్‌ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

పుల్కల్‌ ఎస్సై నాగలక్ష్మి సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి  వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ రమణ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు.

ఇదీ చదవండి: murder: ఓ భర్త కిరాతకం.. సినీ ఫక్కీలో భార్యను కడతేర్చాడు

Last Updated :Aug 6, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.