ETV Bharat / crime

ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్యాయత్నం

author img

By

Published : May 25, 2022, 8:41 PM IST

family suicide attempt
కుటుంబం ఆత్మహత్యాయత్నం

Family suicide attempt: హైదరాబాద్​ సరూర్​ నగర్​ పీఎస్​ పరిధిలో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. బిల్లుల విషయంలో ఓ కాంట్రాక్టర్​ మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. బాధితుల బంధువుల ద్వారా సమచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరడంతో ప్రాణాపాయం తప్పింది.

Family suicide attempt: హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు పిల్లలకు నిద్రమాత్రలు వేసి దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. పిల్లలు వాంతులు చేసుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. రూ. 2 కోట్ల వరకూ రావాల్సిన కాంట్రాక్ట్​ బిల్లులు రాకుండా ఓ వ్యక్తి అడ్డుకోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బాధితుడు సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఖమ్మంకు చెందిన దంపతులు శశికుమార్​, శ్వేత తమ ఇద్దరు పిల్లలతో సహా హైదరాబాద్​ దిల్​సుఖ్​నగర్​లోని లాడ్జిలో దిగారు. అనంతరం పిల్లలకు నిద్ర మాత్రలు ఇచ్చి.. భార్య శ్వేతతో పాటు తానూ తీసుకున్నారు. అంతకుముందుగా సెల్పీ వీడియోలో ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడిస్తూ సూసైడ్​ లెటర్​తో పాటు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తనకు రావాల్సిన కాంట్రాక్టు బిల్లులు రావడంలేదని... ఆ డబ్బులు ఇవ్వకుండా దినేష్​ రెడ్డి అనే కాంట్రాక్టర్​ వేధింపులకు గురిచేయడంతోపాటు... ఆర్థిక ఇబ్బందులు కూడా తోడవవ్వడంతో మనస్తాపానికి గురైన ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియోలో తెలిపారు.

family suicide attempt
సూసడ్​ లెటర్​
family suicide attempt
సూసైడ్​ లెటర్​

"నేను జేవీఎఫ్​ ప్రతాప్​ రెడ్డి కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు రావాల్సిన బిల్లులు రాకుండా నన్ను వేధింపులకు గురిచేస్తున్నారు. మా చనిపోవడానికి కారణం దినేష్​ రెడ్డి. రూ. 2 కోట్ల వరకూ రావాల్సి ఉంది. మాకు రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టడమే కాకుండా మా మీద దొంగతనం కేసు మోపారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ అవమానాలు భరించలేక మా పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం." -శశి కుమార్​, బాధితుడు

నిద్రమాత్రలు మింగాక.. శశికుమార్​ తన బావమరిదికి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు. ఆందోళన చెందిన సదరు వ్యక్తి.. వెంటనే సరూర్​ నగర్​ పోలీసులకు ఫోన్​ ద్వారా సమాచారం అందించారు. హుటాహుటిన లాడ్జికి చేరుకున్న పోలీసులు.. వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సెల్ఫీ వీడియోలో గోడు వెళ్లబోసుకుంటున్న బాధితుడు శశికుమార్​

ఇవీ చదవండి: Cyber cheating: ఎంబీబీఎస్​ సీటు ఎరగా చూపి.. రూ. పది లక్షలు కాజేశారు

కశ్మీర్​ వేర్పాటువాద నేత యాసిన్​మాలిక్​కు జీవితఖైదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.