‘అందమైన సాయంత్రాలు.. అవధులులేని ఆనందం’ అంటూ మెసేజ్‌లు వస్తున్నాయా?

author img

By

Published : Apr 30, 2022, 9:05 AM IST

new plan of cyber criminals
మీకు ఇలాంటి మెసేజ్​లు వస్తున్నాయా.. అయితే క్లిక్ చేశారో అంతే ఇక!! ()

Cyber Crime Latest: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. నేరాలు పెరిగిపోవడంతో.. భద్రత కూడా పెరుగుతూ వస్తోంది. పాత తరహాలో మోసాలకు పాల్పడటం కష్టంగా మారడంతో నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. తాజాగా కోల్‌కతా కేంద్రంగా సైబర్‌ నేరస్థులు యువకులపై వలపు వల విసురుతున్నారు. నమ్మి మాట్లాడితే.. ఇక అంతే సంగతులు..

Cyber Crime Latest: అందమైన సాయంత్రాలు.. అవధులులేని ఆనందం ఆస్వాదించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? మాతో మాట్లాడండి.. అంటూ మీ చరవాణులకు, వాట్సాప్‌కు సంక్షిప్త సందేశాలు వస్తున్నాయా? నిజమేనననుకుని మాట్లాడితే మీ బ్యాంక్‌ ఖాతాల్లోంచి రూ.లక్షలు మాయమవడం ఖాయం. కోల్‌కతా కేంద్రంగా సైబర్‌ నేరస్థులు యువకులపై ప్రయోగించిన సమ్మోహనాస్త్రాలివి. చరవాణులకు వచ్చిన ఫోన్‌నంబర్లతో మాట్లాడిన కొందరు రూ.లక్షలు నగదు బదిలీ చేసి మోసమని తెలుసుకుని సైబర్‌ క్రైమ్‌పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

రూ.10 వేలు కడితే సభ్వత్యం: చరవాణులకు సంక్షిప్త సందేశాలు, వాట్సాప్‌ నంబర్‌కు చిత్రాలు పంపుతున్న సైబర్‌ నేరస్థులు బాధితులను మోసం చేసేందుకు భారీ నెట్‌వర్క్‌ నిర్వహిస్తున్నారు. రోజుకు వెయ్యిమందికి సందేశాలు పంపుతున్నారు. స్పందించిన వారితో ఫోన్‌లో మాట్లాడేందుకు అందమైన యువతులను టెలీకాలర్లుగా నియమించుకున్నారు. ఫోన్‌ చేసిన వారితో మత్తుగా మాట్లాడ్డం.. ఫలానా చోట ఉన్నాం.. భోజనం చేద్దామంటూ చెప్పించడం.. బాధితులు అంగీకరించగానే రూ.10వేలు సభ్యత్వరుసుం చెల్లించాలని షరతు విధిస్తున్నారు. చెల్లించగానే.. వీడియోకాల్‌ చేసి మాట్లాడుతున్నారు. రిసార్ట్‌కు వెళ్దాం.. నాకు నగదు బదిలీ చేస్తే.. తెలిసిన ప్రాంతానికి వెళ్దాం అంటున్నారు. నగదు బదిలీ చేయగానే.. మాట్లాడ్డం ఆపేస్తున్నారు..

పోలీసులు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌.. వలపు వలలో చిక్కుకున్న ఓ యువకుడు యువతి సూచనలకు అనుగుణంగా రూ.1.10లక్షలు నగదు బదిలీ చేశాడు. రమ్మన్న ప్రాంతానికి వెళ్తే అక్కడ ఆమె లేదు. మోసపోయానని గ్రహించిన యువకుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారు అతడి ఎదురుగానే మూడు ఫోన్లతో మాట్లాడారు. ఆమె పేరుతో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేయగా.. సికింద్రాబాద్‌లో ఉన్నానని చెప్పింది. వెంటనే వచ్చి సభ్యత్వ రుసుం కట్టేస్తానంటూ పోలీసుఅధికారి చెప్పిన వెంటనే ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసింది. మరో పేరున్న యువతికి ఫోన్‌ చేసినా ఆమె కూడా స్విచ్ఛాఫ్‌ చేసింది. ఆ సిమ్‌కార్డులు కోల్‌కతాలోనివని తేలింది.

డేటింగ్‌.. మీటింగ్‌తో మాయోపాయాలు: 'డేటింగ్‌-మీటింగ్‌ పేరుతో చరవాణులు, వాట్సాప్‌ నంబర్లకు సంక్షిప్త సందేశాలు, ఫొటోలు వస్తున్నాయి. కోల్‌కతా సైబర్‌ నేరస్థుల పనేనని ఆధారాలు లభించాయి. పది కాల్‌సెంటర్లు ఏర్పాటుచేశారని తెలుసుకున్నాం. అక్కడికి వెళ్లి నిందితులను అరెస్ట్‌ చేయనున్నాం. యువతుల పేర్లు.. ఫోన్‌నంబర్లతో వచ్చిన సందేశాలను, చిత్రాలపై సైబర్‌ క్రైమ్‌ ఠాణాల్లో సమాచారం ఇవ్వండి. మోసపోబోయే వందలమందిని రక్షించినవారవుతారు.' - కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ, సైబర్‌ క్రైమ్స్‌ హైదరాబాద్‌

ఇవీ చదవండి:


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.