ETV Bharat / crime

హోలీ వేడుకల్లో అపశృతి.. చెరువులో గల్లంతై వ్యక్తి మృతి

author img

By

Published : Mar 30, 2021, 9:35 AM IST

మహబూబ్​నగర్ జిల్లా బాలానగర్​లో.. హోలీ పండుగ వేళ అపశృతి చోటుచేసుకుంది. మోతీ ఘనపూర్​​లో.. చెరువులో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు.

man drowned in a pond
చెరువులో గల్లంతై వ్యక్తి మృతి

హోలీ పండుగ.. మహబూబ్​నగర్ జిల్లా బాలానగర్​లో విషాదం నింపింది. మోతీ ఘనపూర్​​లో.. చెరువులో ఈతకు వెళ్లిన రామయ్య (45) నీటమునిగి మృతి చెందాడు. సంబురాల అనంతరం.. చెరువులోకి దిగిన రామయ్య, ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యాడు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదం.. తీసింది నెమలి ప్రాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.