ETV Bharat / crime

ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 14 ఏళ్ల శిక్ష

author img

By

Published : Apr 20, 2021, 4:48 AM IST

నిందితుడికి 14 ఏళ్ల శిక్ష
నిందితుడికి 14 ఏళ్ల శిక్ష

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడికి శిక్ష పడింది. నిందితుడికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కోప్రగాడి సంజయ్ అనే వ్యక్తికి రంగారెడ్డి కోర్టు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఎల్బీనగర్​లో నివాసం ఉంటున్న సంజయ్ 2017 ఆగస్టులో అదే ప్రాంతంలో నివాసం ఉండే ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఘటనపై బాలిక తల్లి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి, సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన మెట్రోపాలిటన్​ సెషన్స్ జడ్జి నిందితునికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించారు.

నిందితునికి శిక్ష పడేలా సాక్ష్యాలు సేకరించిన ఎల్బీనగర్ పోలీసులను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ అభినందించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలోని అన్నికోర్టుల్లో ప్రత్యక్ష విచారణ నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.