ETV Bharat / crime

మద్యం మత్తు.. ఆపై రాంగ్​ రూట్..

author img

By

Published : May 19, 2021, 12:09 PM IST

kukatpally y junction road accident
కూకట్​పల్లిలో రోడ్డు ప్రమాదం, సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసు ట్విట్టర్​

మద్యం మత్తులో ఉండి రాంగ్​ రూట్​లో బైక్​ నడిపిన వ్యక్తి నిర్లక్ష్యం ఇద్దరిని ప్రమాదంలోకి నెట్టింది. రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ట్రాఫిక్​ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో సీసీటీవీ దృశ్యాలను పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

'మద్యం సేవించి, రాంగ్ రూట్​లో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కాకండి.. ఇతరులను అవస్థలకు గురి చేయకండి' అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి వై జంక్షన్​లో ఈ నెల 11న అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు‌ చేసుకుంది. ఎదురెదురుగా వేగంగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొనటంతో వాహనదారులకు గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉండి రాంగ్ రూట్​లో వచ్చిన వ్యక్తి మరో బైక్​ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

తృటిలో తప్పిన ప్రాణ నష్టం.. ఇద్దరి నిర్లక్ష్యమే కారణం.!

ప్రమాదంలో కూకట్​పల్లి ఎల్లమ్మ బండ ప్రాంతానికి చెందిన గొల్లమండ్ల త్రిప్రసాద్(24)​కు కాలు విరిగింది. త్రిప్రసాద్ బాలానగర్​లోని ఓ ల్యాబ్​లో కొవిడ్ శాంపిల్స్ ఇచ్చి తిరిగి వస్తుండగా.. మద్యం మత్తులో ఉన్న మరో వ్యక్తి అపసవ్య దిశలో రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ దృశ్యాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్​ చేయటంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. 12న త్రిప్రసాద్ కుటుంబ సభ్యులు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు..

  • Driving under the influence of Alcohol; Driving in opposite direction; Driving without Driving License by both the riders.

    A non-fatal accident at Kukatpally Y junction.#RoadSafetyCyberabad #RoadSafety pic.twitter.com/F1GjNj24pI

    — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) May 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: యథేచ్ఛగా సాగుతోన్న అక్రమ మట్టి తవ్వకాల దందా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.