ETV Bharat / crime

కాంగ్రెస్​, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఇద్దరికి గాయాలు

author img

By

Published : May 21, 2021, 1:03 PM IST

కాంగ్రెస్​, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ
కాంగ్రెస్​, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ

ఖమ్మం జిల్లా రమణగుట్టలో కాంగ్రెస్​, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకోగా.. ఇద్దరు కాంగ్రెస్​ కార్యకర్తల తలలు పగిలాయి. ఘటనపై ఒకరిపై ఒకరు పోలీస్​స్టేషన్​లలో ఫిర్యాదు చేసుకున్నారు.

ఖమ్మం రెండో పట్టణ పోలీస్​స్టేషన్ పరిధిలోని రమణగుట్టలో కాంగ్రెస్, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తెరాస కార్యకర్తలు, వీఆర్​వో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. స్థానిక కార్పొరేటర్​కు సమాచారం ఇవ్వకుండా చెక్కులు ఎలా అందిస్తారని కాంగ్రెస్ కార్యకర్తలు వారిని ప్రశ్నించారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ముదిరి.. కర్రలతో దాడి చేసుకున్నారు. ఘటనలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తల తలలు పగిలాయి. అనంతరం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్​స్టేషన్​లలో ఫిర్యాదు చేసుకున్నారు.

కాంగ్రెస్​, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ

ఇదీ చూడండి: సుల్తాన్​బజార్ ప్రభుత్వాస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.