ETV Bharat / crime

బాలికను ఢీకొట్టిన ద్విచక్రవాహనం... సీసీ కెమెరాలో దృశ్యాలు

author img

By

Published : Feb 24, 2021, 10:19 PM IST

ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బాలికను ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

cc-tv-captured-accident-visuals-in-markapuram-prakasam-district
బాలికను ఢీకొట్టిన ద్విచక్రవాహనం... సీసీ కెమెరాలో దృశ్యాలు

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం ఓ బాలికను ఢీకొట్టింది. ఎన్ఎస్​నగర్​లోని ఓ స్కానింగ్ కేంద్రానికి వైద్యం కోసం తల్లిదండ్రులతో పాటు ఓ బాలిక వచ్చింది. వారు వైద్యశాలలో ఉండగా.. చిన్నారి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది.

ఈ క్రమంలో వేగంగా వస్తున్న ద్విచక్రవాహనం ఆ బాలికను ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలికకు ఎలాంటి గాయాలు కాకపోవటంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

బాలికను ఢీకొట్టిన ద్విచక్రవాహనం... సీసీ కెమెరాలో దృశ్యాలు

ఇదీ చదవండి: మినీ మేడారంలో సీతక్క నృత్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.