ETV Bharat / crime

బంధువులింటికి వెళ్తుండగా ప్రమాదం... ఒకరు మృతి

author img

By

Published : May 10, 2021, 8:31 PM IST

accident at suryapet
సూర్యాపేటలో రోడ్డుప్రమాదం

సూర్యాపేట జిల్లా మునగాలలో ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మొత్తం ఏడుగురు గాయపడ్డారు. నకిరేకల్​ నుంచి కోదాడలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

సూర్యాపేట జిల్లా మునగాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కోటాచారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రంగా, నలుగురికి స్వలంగా గాయాలయ్యాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.

నకిరేకల్​ నుంచి కోదాడలోని బంధువు ఇంటికి వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇవీచూడండి: లాక్​డౌన్​పై రేపు సీఎం కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.