రంగారెడ్డి జిల్లా జాపాల గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బోడకొండ గ్రామానికి చెందిన జాటోతు లక్ష్మణ్... తన బంధువుతో కలిసి వెళ్తుండగా.... ద్విచక్రవాహనం అదుపుతప్పింది.
ఈ క్రమంలో వేగంగా రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇరువురు తీవ్రంగా గాయపడి... అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం.. అభిషేకాలతో తన్మయత్వం