ETV Bharat / crime

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బహదూర్​పురా ఎస్సై

author img

By

Published : Jan 13, 2023, 9:29 PM IST

Updated : Jan 13, 2023, 10:11 PM IST

తప్పు జరగకుండా చూడాల్సిన పోలీసులే లంచాలకు ఆశపడి అవినీతి బాట పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీ బహదూర్​పురా ఎస్సై శ్రవణ్ కుమార్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకుని ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్సై శ్రవణ్ కుమార్
ఎస్సై శ్రవణ్ కుమార్

బహదూర్​పురా ఎస్సై శ్రవణ్ కుమార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. గత నెల 17న మహమ్మద్ ముజీబ్ అనే వ్యక్తి తన కుమారుడు హతీఖ్ మొబైల్ తిరిగి ఇవ్వడానికి ఎస్సై శ్రవణ్ కుమార్ లంచం డిమాండ్ చేస్తునట్లు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీనిపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఎస్సై హతీఖ్ ​నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ఏసీబీ అధికారులు లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గత నెల 17న మహమ్మద్ ముజీబ్ అనే వ్యక్తి తన కుమారుడు హతీఖ్ మొబైల్ తిరిగి ఇవ్వడానికి ఎస్సై శ్రవణ్ కుమార్ లంచం డిమాండ్ చేస్తునట్లు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రవణ్ కుమార్ హతీఖ్ మొబైల్ ఫోన్​ని దగ్గర ఉంచుకుని రూ.10 వేలు డిమాండ్ చేశాడు. రూ.8 వేలకు బేరం కుదుర్చుకుని లంచం తీసుకుంటుండగా ఈరోజు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నాం. - ఏసీబీ అధికారి

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ బహదుర్​పుర ఎస్సై శ్రవణ్ కుమార్

ఇవీ చదవండి:

Last Updated :Jan 13, 2023, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.