ETV Bharat / crime

దమ్ము చేస్తుండగా ట్రాక్టర్​ బోల్తా... యువకుడు మృతి

author img

By

Published : Jan 19, 2021, 8:08 PM IST

దమ్ము చేస్తుండగా ట్రాక్టర్​ బోల్తా... యువకుడు మృతి
దమ్ము చేస్తుండగా ట్రాక్టర్​ బోల్తా... యువకుడు మృతి

వరి పొలం దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను లేపి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు.

మహబూబాబాద్​ జిల్లా నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం శివారు పెద్ద తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వరి పొలంలో దమ్ము చేస్తుండగా ట్రాక్టర్​ బోల్తా పడింది. ప్రమాదంలో ట్రాక్టర్​ డ్రైవర్​ సాగర్‌ ప్రాణాలు కోల్పోయాడు.

జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను లేపి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. సాగర్​ అదే గ్రామంలో కొంతకాలంగా ట్రాక్టర్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కొడుకుకు నిప్పంటించిన తండ్రి అరెస్ట్ ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.