ETV Bharat / crime

సీబీఐకి చిక్కిన రైల్వే ఉద్యోగి.. రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ..

author img

By

Published : Jun 30, 2022, 10:36 AM IST

Updated : Jun 30, 2022, 2:59 PM IST

cbi raids: దక్షిణ మధ్య దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ ఇంజినీర్‌ సురేశ్‌ సీబీఐ అధికారులకు చిక్కారు. ఓ రైల్వే పైవంతెన కాంట్రాక్ట్‌ కోసం వ్యక్తి నుంచి రూ.5లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

సీబీఐ
సీబీఐ

cbi raids: దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ ఇంజినీర్‌ సురేశ్ లంచం తీసుకుంటూ నిన్న​ సీబీఐకి పట్టుబడ్డారు. ఉప్పల్- జమ్మికుంట మధ్య రైల్వే పైవంతెన కాంట్రాక్ట్‌ కోసం ఓవ్యక్తి నుంచి రూ.5లక్షలు తీసుకుంటుండగా.. నాచారంలోని అతడి నివాసంలో సీబీఐ అధికారులు రెడ్​హ్యాండడ్​గా పట్టుకున్నారు​. నిన్న సాయంత్రం నుంచి అతని ఇంటిలో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సురేశ్​ను అరెస్ట్ చేసి సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. అతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: Inter students suicide: రాష్ట్రంలో మరో ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్య

దేశంలో కరోనా ఉద్ధృతి.. లక్ష దాటిన యాక్టివ్​ కేసులు

Last Updated : Jun 30, 2022, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.