ETV Bharat / crime

SUICIDE ATTEMPT: పోడు సమస్య.. అధికారుల తీరుతో ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Aug 14, 2021, 4:43 PM IST

Updated : Aug 14, 2021, 9:44 PM IST

SUICIDE ATTEMPT: తన పొలంలో మొక్కలు నాటారని.. పురుగుల మందు తాగాడు
SUICIDE ATTEMPT: తన పొలంలో మొక్కలు నాటారని.. పురుగుల మందు తాగాడు

ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు సమస్య రగులుతూనే ఉంది. ఖమ్మం ఘటన మరువక ముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. బూర్గంపాడు మండలంలో అటవీ అధికారుల తీరుతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు.

SUICIDE ATTEMPT: పోడు సమస్య.. అధికారుల తీరుతో ఆత్మహత్యాయత్నం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన రైతు భూక్య హుస్సేన్​ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తను సాగు చేసుకుంటున్న భూమిలో అటవీ అధికారులు మొక్కలు నాటుతున్నారనే మనస్తాపంతో పురుగుల మందు తాగాడు.

పాండురంగాపురం గ్రామానికి చెందిన భూక్య హుస్సేన్ బూర్గంపాడు మండలం ఉప్పుసాకలో గల సర్వే నెంబర్​ 90లో 10 ఎకరాల భూమిని చాలా కాలం నుంచి సాగు చేసుకుంటున్నాడు. అయితే ఈ భూమి విషయంలో భూక్య హుస్సేన్​కు, అటవీ అధికారులకు మధ్య గతంలో వివాదం తలెత్తగా.. భూక్య హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆ కేసు హైకోర్టులోనే ఉంది.

ఇదిలా ఉండగా.. నేడు అటవీ శాఖ అధికారులు ఆ భూమిలో జామాయిల్​ మొక్కలు నాటేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న భూక్య అక్కడికి చేరుకున్నాడు. ఈ భూమికి సంబంధించి హైకోర్టులో కేసు ఉందని.. మొక్కలు నాటొద్దని అధికారులను కోరాడు.

భూక్య హుస్సేన్​ మాటలు పట్టించుకోని అటవీ అధికారులు.. భూమిలో మొక్కలు నాటారు. దీంతో మనస్తాపం చెందిన అతడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు స్థానికుల సహాయంతో పాల్పంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: NHRC: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్‌హెచ్చార్సీ ఆగ్రహం

Last Updated :Aug 14, 2021, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.