ఎంపీడీవో వద్ద రూ.3.4 కోట్ల ఆస్తులు గుర్తింపు... 14 రోజుల రిమాండ్​..

author img

By

Published : Jan 12, 2022, 7:45 PM IST

14Days Remand For Manoharabad MPDO jaipalreddy

Manoharabad MPDO arrest : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మెదక్​ జిల్లా మనోహరబాద్​ ఎంపీడీవో జైపాల్​రెడ్డికి అనిశా ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్​ విధించింది. జైపాల్​రెడ్డిని అనిశా అధికారులు చంచల్​గూడ జైలుకు తరలించారు.

Manoharabad MPDO arrest : మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎంపీడీవో జైపాల్​రెడ్డికి అనిశా ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్​ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైపాల్​రెడ్డిని అరెస్ట్ చేసిన అధికారులు.. హైదరాబాద్​లోని అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్​ కోసం చంచల్​గూడ జైలుకు తరలించారు. జనవరి 11న ఉదయం నుంచి జైపాల్​రెడ్డి ఇంటితో పాటు... మనోహరాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు.

నిజామాబాద్ రేంజ్ డీఎస్పీ ఆనంద్​కుమార్ నేతృత్వంలో బృందాలుగా విడిపోయిన అనిశా అధికారులు.. మనోహరాబాద్ ఎంపీడీఓ కార్యాలయం, మేడ్చల్ సూర్యనగర్​లోని జైపాల్​రెడ్డి నివాసంతో పాటు మరో రెండు చోట్ల సోదాలు చేశారు. జైపాల్​రెడ్డికి చెందిన 3 బ్యాంకు లాకర్లను పరిశీలించారు. మొత్తం రూ.3.4 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించినట్లు అనిశా అధికారుల విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. స్థిర, చరాస్తులతో పాటు బంగారం, నగదును అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైపాల్​రెడ్డిపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అనిశా అధికారులు తెలిపారు.

సంబంధిత కథనం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.