ACB Raids on MPDO: ఎంపీడీవో ఇంట్లో ముగిసిన అనిశా సోదాలు.. లాకర్లు, నగదు సీజ్‌

author img

By

Published : Jan 11, 2022, 3:32 PM IST

Updated : Jan 11, 2022, 9:55 PM IST

ACB Raids on MPDO

ACB Raids on MPDO: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఎంపీడీవోపై ఆరోపణలు రావడంతో అవినీతి శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్‌ ఎంపీడీవో జైపాల్‌ రెడ్డి కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో సోదాలు చేశారు. ఆయన ఇంట్లో రూ.25 లక్షల నగదును అనిశా అధికారులు గుర్తించారు.

ACB Raids on MPDO: మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎంపీడీవో జైపాల్ రెడ్డి కార్యాలయంలో అనిశా దాడులు ముగిశాయి. మనోహరాబాద్‌ ఎంపీడీవో జైపాల్‌రెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయంతో పాటు మేడ్చల్‌లోని ఆయన నివాసంలో మంగళవారం ఏకకాలంలో సోదాలు చేపట్టింది. జైపాల్ రెడ్డి ఇంట్లో రూ.25 లక్షల నగదును అనిశా అధికారులు గుర్తించారు. ఆయన పేరిట ఉన్న రూ.66 లక్షల విలువైన ఆస్తులు గుర్తించినట్లు అనిశా అధికారులు వెల్లడించారు. ఎంపీడీవోకి చెందిన 3 లాకర్లు సీజ్ చేసినట్లు తెలిపారు.

ఉదయం నుంచి కొనసాగిన దాడులు

manoharabad MPDO office: మెదక్ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా విడిపోయిన అధికారులు ఉదయం నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మనోహరాబాద్‌ ఎంపీడీవో కార్యాలయం, ఇంట్లో దస్తావేజులతో పాటు ఆయన ఆస్తులపై ఆరా తీశారు. జైపాల్ రెడ్డి ఇప్పటికే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. అది డిసెంబర్ 31 వరకు పూర్తి కాగా జిల్లా కలెక్టర్ ఆమోదం ఇంకా ఆమోదించలేదని తెలుస్తోంది.

Last Updated :Jan 11, 2022, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.