ETV Bharat / city

ప్రపంచ సాంకేతిక రంగంలో భారత యువతదే కీలకపాత్ర : తమిళిసై

author img

By

Published : Mar 12, 2021, 12:02 PM IST

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట 75 వసంతాల స్వాతంత్య్రపు సంబురాలకు రాష్ట్రం సమాయత్తమైంది. వరంగల్​లో ఈ వేడుకలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు.

governor-tamilisai-at-amrut-mahotsav-in-warangal
వరంగల్​లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

దేశానికి స్వాతంత్య్రం లభించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ అంబరాన్నంటే వేడుకలకు యావద్దేశం సిద్ధమైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట 75 ఏళ్ల స్వాతంత్య్రపు సంబురాలకు తెలంగాణ రాష్ట్రం కూడా ముస్తాబైంది. వరంగల్ నగరంలో నిర్వహించిన ఈ వేడుకలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతోన్న ఈ కార్యక్రమాన్ని తమిళిసై ప్రారంభించారు. జాతీయ పతాకం ఆవిష్కరించిన గవర్నర్.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వతంత్ర భారతం అనేక రంగాల్లో గణనీయమైన విజయం సాధించిందని అన్నారు. మంగళ్​యాన్ నుంచి బుల్లెట్ రైలు వరకు అనేక రంగాల్లో పురోగతి సాధించిందని తెలిపారు.

ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ అందించే స్థాయికి చేరిందని పునరుద్ఘాటించారు. 50 దేశాలకు పైగా కొవిడ్ టీకా సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో ముమ్మరంగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతోందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగాల్లో భారత యువతదే కీలకపాత్ర అని తమిళిసై పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.