ETV Bharat / city

Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ.. కడప జిల్లా కోర్టుకు బదిలీ

author img

By

Published : Feb 22, 2022, 3:43 PM IST

YS Viveka Murder Case transfer: ఏపీ మాజీ ఎంపీ వైఎస్​ వివేకా హత్య కేసు.. పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఇక నుంచి కడప జిల్లా కోర్టులోనే వివేకా హత్య కేసు విచారణ జరగనుంది.

YS Viveka Murder Case transfer
వైఎస్​ వివేకా హత్య కేసు బదిలీ

YS Viveka Murder Case transfer: ఆంధ్రప్రదేశ్​ మాజీ ఎంపీ వైఎస్‌ వివేకా హత్య కేసు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు కేసు విచారణను పులివెందుల మేజిస్ట్రేట్‌ బదిలీ చేశారు. దీంతో ఇక నుంచి కడప జిల్లా కోర్టులోనే వివేకా హత్య కేసు విచారణ జరగనుంది. రిమాండ్‌, వాయిదా, బెయిల్‌ అంశాలు కడప కోర్టులోనేనని మేజిస్ట్రేట్ ఆదేశించారు. మరోవైపు పులివెందుల కోర్టుకు నలుగురు నిందితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్‌.. నలుగురి సీబీఐ అభియోగ పత్రాల వివరాలు అందించారు.

నిందితుల రిమాండ్ పొడిగింపు..

అంతకుముందు ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు పులివెందుల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులోని ముగ్గురు నిందితుల రిమాండ్ గడువును న్యాయస్థానం.. 14 రోజుల పాటు పొడిగించింది. కడప జైలులోని సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలను కొంత ఆలస్యంగా కోర్టుకు తీసుకొచ్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరుకాలేదు. శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: బంగారు తెలంగాణ కాదు... ఇది బానిసత్వపు తెలంగాణ: షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.