మెట్రో నగరాల్లో వ్యాపారులకు లాభాలు తెచ్చిపెడుతోంది తందూరి చాయ్. మంచి రుచి, ఆరోగ్యకరం కావటడంతో దీనిని తాగేందుకు ఛాయ్ ప్రియులు క్యూ కడుతున్నారు. ఈ తేనీరు రుచిని ఏపీలోని ఒంగోలు వాసులకు పరిచయం చేశాడు అదే పట్టణానికి చెందిన రాజేష్. ఎంబీఎ చదివిన ఇతను... ఇటీవలే మంగమూరు రోడ్డులో టీ స్టాల్ను ప్రారంభించాడు.
చిన్నపాటి మట్టి కూజాను అగ్ని కొలిమిలో వేడి చేసి, ఆ తరువాత మసాలా టీని అందులో పోసి మట్టి కప్పులలో వినియోగదారుడికి అందిస్తున్నాడు. ఈ మట్టి కప్పును ఒకసారి మాత్రమే వినియోగిస్తున్నాడు. గుజరాత్ నుంచి వీటిని తెప్పిస్తున్నారు. అంతేకాకుండా ఒక్కో చాయ్ను కేవలం 15 రూపాయలకే విక్రయిస్తున్నాడు. దీని రుచి చూసేందుకు ఒంగోలు వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇదీ చదవండి : తందూరి ఛాయ్ని టేస్ట్ చేసిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి