ETV Bharat / city

ట్రయల్ రన్ విజయవంతం.. త్వరలో జేబీఎస్-ఫలక్​నూమ మెట్రో..!

author img

By

Published : Nov 25, 2019, 9:55 PM IST

హైదరాబాద్​ నగర ప్రజలకు మరో మెట్రో కారిడార్​ అందుబాటులోకి రానుంది. జేబీఎస్ - ఫలక్​నూమ మార్గంలో త్వరలో మెట్రో రైలు పూర్తి సేవలు అందించనుంది. పనులు పూర్తైన సందర్భంగా అధికారులు పూజలు నిర్వహించి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ట్రయల్ రన్​లో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి పాల్గొన్నారు.

ట్రయల్ రన్ విజయవంతం... త్వరలో పూర్తి సేవలు..!

జేబీఎస్ - ఫలక్​నూమ మార్గంలో త్వరలో మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి రానుంది. నిర్మాణ పనులు పూర్తైన సందర్భంగా అధికారులు పూజలు నిర్వహించి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. మెట్రో ట్రయల్ రన్ ప్రారంభ వేడుకలో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మెట్రో రైలులో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు.

అన్ని రకాల టెక్నికల్ పరీక్షలు చేస్తం..

మొత్తం 11 కిలోమీటర్ల మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ట్రయల్ రన్ సందర్భంగా అన్ని రకాల టెక్నికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా సిగ్నలింగ్.. బ్రేక్ టెస్ట్ సిగ్నలింగ్, ప్రైమ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ వ్యవస్థను పరీక్షిస్తున్నారు. ట్రయల్ రన్ విజయవంతం కావడం వల్ల కొన్ని వారాల నిర్వహించి.. కమిషనర్ ఆఫ్ మెట్రో రైలు నుంచి తుది అనుమతులు లభించిన వెంటనే ఈ మార్గాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

ట్రయల్ రన్ విజయవంతం... త్వరలో పూర్తి సేవలు..!

ఇదీ చూడండి: జేబీఎస్​ - ఎంజీబీఎస్​ ట్రయల్​ రన్​ విజయవంతం

TG_HYD_73_25_Metro_Jbs_Trail_Run_Start_Av_3182301 Reporter: Kartheek నోట్ః ఫీడ్ డెస్క్ వాట్సాప్ () జేబీఎస్ ఫలక్నుమా మార్గంలో ఎంజీబీఎస్ వరకు త్వరలో మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి రానుంది. నిర్మాణ పనులు పూర్తికావడంతో ఇవాళ పూజలు నిర్వహించి జెండా ఊపి మెట్రో ట్రయల్ రన్స్ ను ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి ప్రారంభించారు. అనంతనం మెట్రో రైలు లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో ఎండీ, ఇతర ఉన్నతాధికారులు ప్రయాణించారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కిలోమీటర్ల మార్గంలో 9 స్టేషన్లు మెట్రో స్టేషన్లు ఉన్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ట్రయల్ రన్ సందర్భంగా అన్ని రకాల టెక్నికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా సిగ్నలింగ్.. బ్రేక్ టెస్ట్ సిగ్నలింగ్, ప్రైమ్ కంట్రోల్ ద్వారా, ఓవర్హెడ్ ఎలక్ట్రికల్ వ్యవస్థను పరీక్షిస్తున్నారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో కొన్ని వారాల పాటు ట్రయల్ రన్స్ నిర్వహిస్తారు. అన్ని రకాల పరీక్షలు పూర్తి అయిన తర్వాత కమిషనర్ ఆఫ్ మెట్రో రైలు నుంచి తుది అనుమతులు లభించిన వెంటనే ఈ మార్గాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ రూట్ లో రోడ్డు మార్గంలో వెళితే 45 నిమిషాల సమయం తీసుకుంటే మెట్రో రైలు 16 నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు. ఈ మార్గంలో జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆసుపత్రి, ముషిరాబాద్, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు, చిక్కడ పల్లి, నారాయణ గూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ స్టేషన్లు ఉన్నాయి. బైట్ః ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైలు ఎండీ ఎండ్.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.