కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై భవిష్యత్ కార్యాచరణ కోసం టీపీసీసీ సబ్కమిటీని ఏర్పాటు చేసింది. కృష్ణానదిపై ప్రభుత్వం నిర్మించిన ఎత్తిపోతల పథకం పంపుహౌజ్లో మోటారు పేలిపోవడం, బేస్మెంట్ దెబ్బతినడం లాంటి సాంకేతిక లోపాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని టీపీసీసీ తేల్చింది. ఈ విషయంలో ఇప్పటికే పోరాట మార్గం ఎంచుకుని ఈనెల 21న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బంద్ చేపట్టింది. తదుపరి భవిష్యత్ కార్యాచరణ కోసం 11 మంది సభ్యులతో కమిటీని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటించారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్బాబు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు నాగం జనార్దన్రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్రెడ్డి, సంపత్ కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి సభ్యులుగా ఉన్నారు.
ఇవీచూడండి: కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల అరెస్ట్