ETV Bharat / city

ఏపీలో కొత్తగా 1,395 కరోనా కేసులు, 9 మరణాలు

author img

By

Published : Nov 17, 2020, 9:08 PM IST

గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,395 కరోనా కేసులు నమోదయ్యాయి. 9 మంది మహమ్మారి బారిన పడి చనిపోయారు. చిత్తూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. కడప, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరు మరణించారు.

Toady 1395 corona-cases-in-andhra-pradesh, 9 perosns died with corona
ఏపీలో కొత్తగా 1395 కరోనా కేసులు, 9 మరణాలు

ఏపీలో కొత్తగా 66,778 కరోనా పరీక్షలు చేయగా... 1,395 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,56,159కు చేరింది. ఒక్కరోజులోనే 9 మంది మరణించగా... మొత్తం మరణాల సంఖ్య 6,890కి పెరిగింది.

కొత్తగా 2,293 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 16,985 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 952 కరోనా కేసులు.. మరో ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.