ETV Bharat / city

Agnipath Protests in Secunderabad :పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి.. నలుగురికి బుల్లెట్ గాయాలు

author img

By

Published : Jun 17, 2022, 11:12 AM IST

Updated : Jun 17, 2022, 3:12 PM IST

Agnipath Protests in Secunderabad
Agnipath Protests in Secunderabad

15:05 June 17

Agnipath Protests in Secunderabad :పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి.. నలుగురికి బుల్లెట్ గాయాలు

అగ్నిపథ్‌పై ఆందోళనల్లో నలుగురికి బుల్లెట్ గాయాలైనట్లు తెలుస్తోందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్​ రాజారావు తెలిపారు. ఛాతీలో గాయమైన వ్యక్తి పరిస్థితి కొంచెం విషమంగా ఉందని.. శస్త్ర చికిత్స చేస్తున్నామని వివరించారు. మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. బాధితులకు తగిలినవి రబ్బర్ బుల్లెట్​లా లేక నిజమైన బుల్లెట్​లా అన్న విషయం ఇంకా తెలియలేదని స్పష్టం చేశారు. మరోవైపు పోలీసుల కాల్పుల్లో చనిపోయిన మృతుడికి పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు.

మరోవైపు ఆందోళనకారుల నిరసనల్లో నాలుగు కోచ్​లు పాక్షికంగా దగ్ధమైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈస్ట్ కోస్ట్ ఎక్స్​ప్రెస్-పాక్షిక కోచ్, అజంతా రెండు పాక్షిక కోచ్​లు, రాజ్​కోట్​ ఒక కోచ్.. పాక్షికంగా దగ్ధమైనట్లు తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో ఇప్పటి వరకు 72 రైళ్లు రద్దు కాగా.. 12 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. మూడింటిని దారి మళ్లించారు.

14:39 June 17

'అగ్నిపథ్' ఆందోళన.. పోలీసుల కాల్పుల్లో పలువురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు!

అగ్నిపథ్‌పై ఆందోళనలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తుండగా... ఇప్పుడు హైదరాబాద్‌కు ఆ నిరసన సెగ తగిలింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ సికింద్రాబాద్‌లో చేసిన ఆందోళనలు... తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. రైల్వేస్టేషన్‌లో బీభత్సం సృష్టించిన నిరసనకారులు... రైలుబోగిలకు నిప్పంటించారు. స్టేషన్‌ పరిసరాల్లోని దుకాణాలను ధ్వంసం చేయడంతోపాటు... బయట ఉన్న ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపగా... పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు 15 మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం.

14:12 June 17

'అగ్నిపథ్' ఆందోళన.. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి

'అగ్నిపథ్' ఆందోళన.. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి

అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గిరాజేస్తోంది. ఈ పథకాన్ని రద్దు చేయాలంటూ సికింద్రాబాద్‌లో యువకులు చేపట్టిన ఆందోళన రణరంగంలా మారింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆందోళనలో మృతిచెందిన వ్యక్తి వరంగల్‌ జిల్లావాసి దామోదర్‌ రాకేశ్‌గా గుర్తించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కి వెళ్లి అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఆందోళనకారులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

13:23 June 17

'అగ్నిపథ్' ఆందోళన.. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి

Agnipath Protests in Secunderabad
మృతుడు దామోదర్ రాకేశ్

ఆందోళనకారులు పోలీసులు, రైళ్లపై రాళ్లతో దాడి చేయడం వల్ల సికింద్రాబాద్ ప్రాంగణం రణరంగాన్ని తలపిస్తోంది. ఆందోళనకారులను కట్టడి చేయడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో పలువురు యువకులు గాయపడ్డారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి యథావిధిగా సైనిక ఎంపిక జరపాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు.

11:09 June 17

'అగ్నిపథ్' ఆందోళన.. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి

పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి.. 8 మందికి గాయాలు

మరోవైపు సికింద్రాబాద్ అల్లర్లతో అప్రమత్తమైన రాష్ట్రంలోని ఇతర రైల్వే స్టేషన్‌లు పోలీసు బలగాలను ఈ స్టేషన్లకి దింపాయి. ముఖ్యంగా నాంపల్లి, వరంగల్, మహబూబాబాద్, కాజీపేట, జనగామ, డోర్నకల్‌, రైల్వేస్టేషన్లలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్లలో రైల్వే పోలీసులతో పాటు సాధారణ పోలీసులు కూడా మోహరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లోకి ఎవరినీ అనుమతించడం లేదు.

Last Updated :Jun 17, 2022, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.