ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @5PM

author img

By

Published : Oct 18, 2022, 5:00 PM IST

Telangana top news today
Telangana top news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • 'భాజపా స్థాయి మరింత దిగజారినట్లైంది'

బిల్కిస్​ బానో అత్యాచార దోషులను విడుదల చేయటంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రేపిస్టులను, పిల్లలను చంపిన వారిని వదిలేయడంతో భాజపా స్థాయి మరింత దిగజారినట్లైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

  • 'రూ.40 వేలు తీసుకుని భాజపాకు ఓటు వేయండి'

సీఎం కేసీఆర్‌ది దండుపాళ్యం ముఠా అని.. ఒక్క రాజగోపాల్​రెడ్డిని ఓడించేందుకు ఆ బ్యాచ్‌ అంతా మునుగోడుకు వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు.

  • బీ అలర్ట్​.. మరో 48 గంటల్లో అల్పపీడనం..!

రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.

  • పవన్​ను కలిసిన చంద్రబాబు..

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్​తో భేటీ అయ్యారు. ఏపీలోని విజయవాడ నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లి పవన్​తో సమావేశమైన చంద్రబాబు.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

ఒమిక్రాన్‌ తాజా వేరియంట్‌ BF.7 భయపెడుతోంది. దీపావళి సెలవుల వేళ ఈ కొత్త వేరియంట్‌ దేశంలో మరో కొత్త వేవ్‌కు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • బరువు తగ్గి రూ.2,300 కోట్లు రాబట్టిన ఎంపీ

32 కిలోల బరువు తగ్గి రూ. 2,300 కోట్లు సంపాందించారు ఓ వ్యక్తి. ఇదేంటీ బరువు తగ్గితే అన్ని కోట్లు ఇస్తారా? అనుకుంటున్నారా! ఆ మధ్య కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విసిరిన సవాల్​ స్వీకరించిన.. మధ్యప్రదేశ్​ ఉజ్జయిని ఎంపీ, భాజపా నేత అనిల్ ఫిరోజియా కేంద్రం నుంచి నియోజక అభివృద్ధి కోసం రూ.2,300 కోట్లు నిధులు సాధించారు.

  • 'ఆ రోడ్డు ప్రమాదాలకు ఇకపై అధికారులే బాధ్యులు'

రోడ్డు నిర్మాణ నాణ్యతలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఎన్‌హెచ్‌ఏఐ సీరియస్‌గా తీసుకుంది. ఒకవేళ అలాంటి రోడ్లలో ప్రమాదాలు జరిగితే వాటికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

  • తప్పులు చేశాం.. క్షమించండి : బ్రిటన్ ప్రధాని

బ్రిటన్‌లో నాయకత్వ మార్పు జరుగుతుందన్న వార్తలు.. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారన్న ఊహాగానాలు.. ప్రధాని వైఖరిపై మెజార్టీ సభ్యులు అసంతృప్తితో ఉన్నారన్న సర్వేల నేపథ్యంలో లిజ్‌ ట్రస్‌ క్షమాపణలు చెప్పారు.

  • పాక్​ పర్యటనకు టీమ్​ఇండియా..

వచ్చే ఏడాది జరగబోయే ఆసియా కప్​ కోసం భారత జట్టు పాకిస్థాన్​ వెళ్లబోయేది లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. అది తటస్త వేదికలో జరుగుతుందని తెలిపాడు. ఇక ఆ విషయంలో తుది నిర్ణయం భారత ప్రభుత్వానిదే అని తెలిపారు.

  • అల్లుఅర్జున్​-రామ్​చరణ్​ కాంబోలో మల్టీస్టారర్..

తమ అభిమాన హీరోలు కలిసి మల్టీస్టారర్​ సినిమా చేస్తే ఫ్యాన్స్​కు​ వచ్చే ఆ కిక్కే వేరు. అలాంటి క్రేజీ కాంబినేషన్స్​లో రామ్​చరణ్​-అల్లుఅర్జున్​ ఒకటి. వారిద్దరు కలిసి నటిస్తే చూడాలనేది మెగా అభిమానుల కోరిక. అయితా అదే కోరిక తనుకు కూడా ఉందని ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్​ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.