students reached Hyderabad From Ukraine: ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చోరవ తీసుకుంటున్నాయి.
ప్రభుత్వమే టికెట్లు కొనిపించి...
నాలుగు ప్రత్యేక విమానాల ద్వారా ఉక్రెయిన్లో ఉన్న తెలంగాణ వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టికెట్లు బుక్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చింది. వారికి శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. వాహనాలు ఏర్పాటు చేసి ఇళ్లకు పంపించారు.
ఫిబ్రవరి 26 నుంచి ఇప్పటి వరకు దాదాపు 111 మంది పౌరులను సురక్షితంగా తీసుకొచ్చారు. మొదట ఉక్రెయిన్ నుంచి దిల్లీ, ముంబయి నగరాలకు రప్పించి తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి:200 మంది భారతీయులతో స్వదేశానికి సీ-17 ఎయిర్క్రాఫ్ట్