ETV Bharat / bharat

200 మంది భారతీయులతో స్వదేశానికి సీ-17 ఎయిర్​క్రాఫ్ట్​

author img

By

Published : Mar 3, 2022, 4:30 AM IST

Updated : Mar 3, 2022, 6:31 AM IST

Indians in Ukraine: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియలో భాగంగా మరో 200 మంది భారత్​కు చేరుకున్నారు. రొమేనియా నుంచి భారత వైమానిక దళం(ఐఏఎఫ్​) విమానం సీ-17.. గురువారం తెల్లవారుజామున దిల్లీ చేరుకుంది. మరో మూడు విమానాల్లో దాదాపు 300 మంది భారత్​కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

Indians in Ukraine
Indians in Ukraine

Indians in Ukraine: ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపులో భాగంగా రొమేనియా రాజధాని బుచారెస్ట్ నుంచి 200 మంది భారతీయులతో భారత వైమానిక దళం(ఐఏఎఫ్​) విమానం.. హిండోన్​ ఎయిర్​ బేస్‌లో దిగింది. సీ-17 మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి విమానం.. గురువారం తెల్లవారుజామున 1.30లకు దిల్లీలో ల్యాండ్ అయింది. ఉక్రెయిన్​లోని భారత పౌరులను తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్​ గంగలో భాగంగా మరో మూడు సీ-17 విమానాల్లో దాదాపు 300 మంది భారత్​కు చేరుకోనున్నారు. ఆ విమానాలు ఉదయం 8 గంటలకు హిండోన్ ఎయిర్‌బేస్‌లో దిగనున్నట్లు సమాచారం.

  • #WATCH | The C-17 Indian Air Force aircraft arriving from Bucharest in Romania, carrying around 200 Indian nationals from #Ukraine, lands at its home base in Hindan near Delhi

    MoS Defence Ajay Bhatt interacted with the citizens after their arrival in Delhi.#OperationGanga pic.twitter.com/uWzo78cMAo

    — ANI (@ANI) March 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్​ భట్​ ఎయిర్‌బేస్ వద్ద తొలి సీ-17 విమానంలో తరలి వచ్చిన భారతీయులకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌లో దాదాపు 8,000 మంది భారతీయులు, ప్రధానంగా విద్యార్థులు చిక్కుకుపోయారని విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా మంగళవారం తెలిపారు. వారిని తరలించేందుకు నలుగులు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్​ పొరుగు దేశాలకు వెళ్లారు. హంగేరీలో హర్దీప్​సింగ్​ పూరి, రొమేనియాలో జ్యోతిరాదిత్య సింధియా, స్లోవేకియాలో కిరణ్​ రిజిజు, పోలాండ్‌లో వీకే సింగ్ ఉన్నారు.

రష్యా సైనిక దాడి కారణంగా ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ గగనతలం మూసివేసింది. దీంతో ఉక్రెయిన్ పశ్చిమాన ఉన్న రొమేనియా, హంగేరి, పోలాండ్ దేశాల నుంచి భారత్​ ప్రత్యేక విమానాల ద్వారా తన పౌరులను తరలిస్తోంది. ఈ పొరుగు దేశాల నుంచే సీ-17 విమానాలు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: రెండోసారి పుతిన్​తో మోదీ ఫోన్ సంభాషణ

Last Updated : Mar 3, 2022, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.