ETV Bharat / city

GRMB: జీఆర్ఎంబీ బోర్డు సమావేశానికి హాజరుకావటం లేదు: తెలంగాణ

author img

By

Published : Aug 5, 2021, 3:47 PM IST

Updated : Aug 5, 2021, 5:09 PM IST

GRMB
జీఆర్ఎంబీ బోర్డు

15:42 August 05

GRMB: జీఆర్ఎంబీ బోర్డు సమావేశానికి హాజరుకావటం లేదు : తెలంగాణ

సోమవారం తలపెట్టిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరు కావడం వీలు కాదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ జీఆర్ఎంబీ ఛైర్మన్​కు లేఖ రాశారు. ఈ నెల తొమ్మిదో తేదీన సుప్రీంకోర్టులో, జాతీయ హరిత ట్రైబ్యునల్​లో కేసుల విచారణ ఉందని... ఆ కారణంగా బోర్డు సమావేశానికి హాజరవడం వీలుపడదని తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సంప్రదించి తదుపరి సమావేశం తేదీని ఖరారు చేయాలని, వీలైనంత త్వరగా సమావేశం నిర్వహించాలని కోరారు.

కేఆర్​ఎంబీకీ లేఖ

కేంద్ర జలసంఘం సభ్యుడు దేవేందర్ రావు విషయంలో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పడంపై తెలంగాణ నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు కూడా తెలంగాణ ఈఎన్సీ మురళీధర్​ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల సందర్శన కమిటీలో సీడబ్ల్యూసీ సభ్యుడు దేవేందర్ రావు ఉండడంపై ఏపీ అభ్యంతరం వ్యక్త చేసింది. దీన్ని తప్పుపట్టిన తెలంగాణ... గతంలో పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి సందర్శన సమయంలో కె.శ్రీనివాస్ విషయంలో తాము అభ్యంతరం చెప్పలేదని తెలిపింది. సీడబ్ల్యూసీ అధికారికి ఏపీ ఇతరత్రాలను ఆపాదించడం దురదృష్టకరం, అనైతికమని వ్యాఖ్యానించింది. ఎన్జీటీ ఆదేశాలను ఆలస్యం చేసేందుకే ఏపీ ఇలా వ్యవహరిస్తోందన్న తెలంగాణ ఈఎన్సీ... దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని అన్నారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ బృందం రాయలసీమ పనులను పరిశీలించి ఈ నెల తొమ్మిదో తేదీ లోగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ కోరింది.

9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం 

ఈనెల 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి(KRMB, GRMB Boards Meeting) సమావేశం జరగనుందని కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే తెలిపారు. హైదరాబాద్ జలసౌధలో ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం నిర్వహించనున్నారు. అత్యవసరంగా ఏర్పాటు చేసిన భేటీలో గెజిట్‌లోని అంశాల అమలు కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. అజెండా అంశాలపై చర్చకు సంబంధించిన డాక్యుమెంట్లతో సమావేశానికి హాజరు కావాలని బోర్డు సభ్యులను కోరారు.

ఇదీ చదవండి: Dalitha Bandhu: వాసాలమర్రికి విడుదలైన దళితబంధు నిధులు.. సంబురాల్లో గ్రామస్థులు

Last Updated :Aug 5, 2021, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.