ETV Bharat / city

Sabitha IndraReddy Latest News : 'తెలంగాణ విద్యాయజ్ఞంలో అందరూ భాగస్వాములవ్వాలి'

author img

By

Published : Mar 11, 2022, 12:24 PM IST

Sabitha IndraReddy Latest News
Sabitha IndraReddy Latest News

Sabitha IndraReddy Latest News : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మొదలైన విద్యాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. నిర్మాణాలకు దాతల పేర్లు పెడతామని తెలిపారు.

'విద్యాయజ్ఞంలో అందరూ భాగస్వాములవ్వాలి'

Sabitha IndraReddy Latest News : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో విద్యాయజ్ఞం మొదలైందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ బడి రుణం తీర్చుకునేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యాయజ్ఞం విజయవంతమయ్యేలా అందరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి పథకాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

Sabitha IndraReddy in Assembly 2022 : "పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి. పాఠశాలలో తరగతి గదులు, నిర్మాణాలకు దాతల పేర్లు పెడతాం. రూ.10 లక్షలు విరాళమిస్తే తరగతి గదికి దాత పేరు పెడతారు. రూ.25 లక్షలు విరాళమిస్తే ప్రాథమిక పాఠశాలకు.. రూ.50 లక్షలు విరాళమిస్తే ప్రాథమికోన్నత పాఠశాలకు.. రూ.కోటి విరాళమిస్తే ఉన్నత పాఠశాలకు దాత పేరు పెడతాం."

- సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

Telangana Assembly Sessions 2022 : విద్యాశాఖలో 21 వేల పోస్టులు మంజూరయ్యాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. త్వరలో విద్యాశాఖలో పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే వారంతా పరీక్షలకు పూర్తిగా సన్నద్ధమవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.