ETV Bharat / city

బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బోనం

author img

By

Published : Jul 5, 2020, 7:26 PM IST

విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి తెలంగాణ నుంచి బోనం సమర్పించారు. హైదరాబాద్​లోని మహంకాళి ఆలయం తరఫున... బంగారు పాత్రలో బోనం వండి పాతబస్తీ భక్తులు అమ్మవారికి సమర్పించారు.

Telangana Bonam
బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బోనం

విజయవాడ కనకదుర్గమ్మకు మహంకాళి ఆలయం తరఫున... బంగారు పాత్రలో బోనం వండి పాతబస్తీ భక్తులు అమ్మవారికి సమర్పించారు. సప్త మాతృకలకు సప్త బంగారు బోనాలు సమర్పణలో భాగంగా దుర్గమ్మకు బోనం సమర్పించినట్లు భక్తులు తెలిపారు.

కరోనా నిబంధనల మేరకు అధికారులు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతించారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈవో, భాగ్యనగర్ మహంకాళీ బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: ఆయన్ను స్మరించుకుంటే మన భాషను గుర్తుచేసుకున్నట్టే: దత్తాత్రేయ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.