ETV Bharat / city

స్వర్ణ కవచాలంకరణలో దర్శనమిచ్చిన సింహాచలేశుడు

author img

By

Published : Dec 25, 2020, 3:05 PM IST

స్వర్ణ కవచాలంకరణలో దర్శనమిచ్చిన సింహాచలేశుడు
స్వర్ణ కవచాలంకరణలో దర్శనమిచ్చిన సింహాచలేశుడు

వైకుంఠ ఏకాదశి సందర్బంగా విశాఖలోని సింహాచల వరహా లక్ష్మీనరసింహస్వామి.. భక్తులకు స్వర్ణ కవచ అలంకారంలో దర్శనమిచ్చారు. తెల్లవారు జాము నుంచే పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చిన భక్తులు.. అప్పన్నస్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యక్ష దైవ స్వరూపం.. సింహచల వరహా లక్ష్మీ నరసింహస్వామి.. వైకుంఠ ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఛైర్​పర్సన్​ సంచయిత గజపతి.. స్వామి వారిని దర్శించుకున్నారు. స్వర్ణ కవచ అలంకారంలో స్వామివారు కనువిందు చేశారు.

దేవి సమేత వరాహ లక్ష్మీ నరసింహుడుగా దర్శనమిచ్చి.. అనంతరం మూల విరాట్​ను దర్శనం చేసుకునేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కొవిడ్ నియమాలు అనుసరిస్తూ భక్తులు దర్శనం చేసుకొనేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

స్వర్ణ కవచాలంకరణలో దర్శనమిచ్చిన సింహాచలేశుడు

ఇవీచూడండి: రాష్ట్రంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.