ETV Bharat / city

sajjala: 'మా గురించి తెలంగాణ మంత్రులకు ఎందుకు?.. మీలా కాళ్లు పట్టుకోవడం మాకు రాదు'

author img

By

Published : Nov 12, 2021, 8:05 PM IST

sajjala
sajjala

ఏపీలో తెదేపా నేతల్లాగే.. తెరాస నేతలు మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) దుయ్యబట్టారు. బిచ్చమెత్తుకుంటున్నామని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Ts minister prashanth reddy) వ్యాఖ్యానించటం సరికాదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్​పై తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు (TS ministers comments on jagan) వారి విచక్షణకే వదిలేస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి జగన్​పై తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు (TS ministers comments on jagan) వారి విచక్షణకే వదిలేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) అన్నారు. బిచ్చమెత్తుకుంటున్నామని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Ts minister prashanth reddy) వ్యాఖ్యానించటం సరికాదన్నారు. కేంద్ర నిధులు రాష్ట్రాల హక్కు అని కేసీఆరే (KCR) అన్నారని.., ఆయన మాటలు తెలంగాణ మంత్రులు వినలేదేమోనని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధుల సాధనలో ఒక్కో రాష్ట్రం ఒక్కో పద్ధతి అవలంబిస్తుందని తెలిపారు. హక్కు ఉందని రోజూ చొక్కాపట్టి నిలదీయలేం కదా అని పేర్కొన్నారు. ఏపీ ఎలా పోతుందో తెలంగాణ మంత్రులకు ఎందుకు ? అన్న సజ్జల.. కేసీఆర్ మెప్పు కోసం కొందరు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో తెదేపా నేతల్లాగే..తెరాస నేతలు మాట్లాడుతున్నారన్నారు.

జగన్​పై తెలంగాణ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్​పై తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా వాళ్లు పైసలు లేక బిచ్చమొత్తుకుంటున్నారని అన్నారు. తెలంగాణ వస్తే ప్రజలు అడుక్కు తింటారని అప్పట్లో ఏపీ నాయకులు అన్నారని గుర్తు చేశారు. కానీ ఏపీలోనే సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారని నిజామాబాద్​ జిల్లాలో తెరాస నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి (ts minister Prasanth reddy) ఈ వ్యాఖ్యలు చేశారు.

"కేసీఆర్ దయతో మన ఆదాయం మనమే అనుభవిస్తున్నాం. ఇప్పుడు మన పైసలు ఆంధ్రాకు పోవట్లేదు. ఆంధ్రా వాళ్లు పైసలు లేక బిచ్చమెత్తుకుంటున్నారు. ఏపీలో సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారు. రోజు ఖర్చుల కోసం కూడా కేంద్రంపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు అప్పులు లేకపోతే ఆంధ్రా నడవదు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గి ఏపీలో బోర్లకు మీటర్లు పెడుతున్నారు. దేశం మొత్తం బోర్లకు మీటర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం మాత్రం భాజపా వాళ్ల కింద మీటర్లు పెట్టాలి" -ప్రశాంత్‌రెడ్డి, తెలంగాణ మంత్రి

స్పందించిన మంత్రి పేర్ని నాని..

నిధుల కోసం కేంద్రం వద్ద జగన్​ బిచ్చం ఎత్తుకుంటున్నారని తెలంగాణ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం(minister perni nani fire on telangana leaders statements) చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో(andhra pradesh) అందరూ కలిసి హైదరాబాద్(hyderabad)​ను అభివృద్ధి చేశారని, పాడికుండ లాంటి హైదరాబాద్ ఉన్నా..తెలంగాణ అప్పుల పాలైందని మంత్రి విమర్శించారు. తెలంగాణ నేతల వైఖరి అత్త మీద కోపం దుత్తమీద చూపినట్లుగా..ఉందని ఆక్షేపించారు. కేసీఆర్(telangana CM KCR) తరచూ కేంద్రం వద్దకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. నిధులిస్తే కేంద్రంలో చేరే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని మంత్రి అన్నారు. బయట కాలర్ ఎగరేసి...లోపలికెళ్లి కాళ్లు పట్టుకోవడం జగన్​కు రాదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Prasanth reddy comments on Jagan : 'ఏపీలో సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.