ETV Bharat / city

కారుబోల్తా పడి నలుగురు దుర్మరణం.. మృతుల్లో తెలంగాణవాసులు

author img

By

Published : Oct 16, 2020, 7:34 AM IST

Updated : Oct 16, 2020, 12:13 PM IST

కారుబోల్తా పడి నలుగురు దుర్మరణం.. మృతుల్లో తెలంగాణవాసులు
కారుబోల్తా పడి నలుగురు దుర్మరణం.. మృతుల్లో తెలంగాణవాసులు

ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి - నార్కట్ పల్లి రహదారిలోని తంగేడు మల్లి మేజర్​లో కారు బోల్తా పడి తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు నీట మునిగి మృతి చెందారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలంలో కారు ప్రమాదానికి గురైంది. గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. అద్దంకి - నార్కట్ పల్లి రహదారిలోని తంగేడు మల్లి మేజర్​లో కారు బోల్తా పడి నలుగురు వ్యక్తులు నీట మునిగి మృతి చెందారు. తెలంగాణ నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తున్న కారు రొంపిచర్ల మండలం సుబ్బాయపాలెం వద్దకు చేరుకోగానే అదుపుతప్పి కాల్వలోకి బోల్తాకొట్టింది. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఘటనలో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నంకు చెందిన పాలోజ్ ఆనంద్, ధర్మపురికి చెందిన ఆయన బావమర్ధి కటకం మహేష్, మరో వ్యక్తి జగదీశ్​ గౌడ్, ఆయన పది సంవత్సరాల కుమారుడు శివమ్ మృతి చెందారు. ప్రమాదంలో గాయపడ్డ మాధవ్ తిమ్మాపూర్లో ఉంటూ పదిహేను సంవత్సరాలుగా మేస్త్రీ పని చేస్తున్నాడు. ప్రకాశం జిల్లా పామూర్ కు చెందిన మాధవ్ అక్కడ తను కట్టుకున్న ఇల్లుకు రంగులు వేసేందుకు వీరుగౌడును, ఫర్నీచర్ పని చేసేందుకు ఆనంద్​ను ధర్మపురి నుంచి తీసుకెళ్తున్నాడు. ఉత్తరప్రదేశ్​కు చెందిన వీరు జగదీశ్​ గౌడ్ పది సంవత్సరాలుగా ధర్మపురిలో ఉంటూ భవనాలకు రంగులు వేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రమాదంలో బావబామ్మర్దులు, తండ్రి కుమారుడు మరణించడంతో ధర్మపురిలో విషాదం నెలకొంది.

కారు డ్రైవర్​, యజమాని మాధవ్​ మాత్రం క్షేమంగా బయటపడ్డారు. మాధవ్​కు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఏపీ: రొంపిచర్ల సమీపంలో కారు బోల్తా.. నలుగురు మృతి

ఇదీ చదవండి: హైదరాబాద్​లో గ్యాంగ్​రేప్​.. బర్త్​డేకి పిలిచి అత్యాచారం..

Last Updated :Oct 16, 2020, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.