ETV Bharat / city

అమరుల త్యాగాలను నిరంతరం స్మరించుకుంటాం: సీపీ

author img

By

Published : Oct 20, 2020, 2:17 PM IST

దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరులను ఎల్లప్పుడు స్మరించుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా.. రాచకొండ కమిషనరేట్​లోని అంబర్​పేట్​ హెడ్​క్వార్టర్స్​లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

rachakonda commissioner mahesh bhagawath
రాచకొండ సీపీ మహేశ్ భగవత్

దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన పోలీసులను స్మరిస్తూ.. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్​ అన్నారు. అంబర్​పేట్​ హెడ్​క్వార్టర్స్​లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు.

ఈ శిబిరంలో.. 1500 మందికి పైగా రక్తదానం చేసినట్లు మహేశ్ భగవత్ తెలిపారు. ఇండియ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన కమిషనరేట్ ప్రధాన కార్యాలయ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ అడిషనల్​ డీసీపీ శంకర్ నాయక్, రెడ్​ క్రాస్​ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.