ETV Bharat / city

' అధికారులు లంచం అడిగితే.. చెట్టుకు కట్టి కొట్టండి..'

author img

By

Published : Dec 31, 2020, 7:53 PM IST

palamaner mla sensational words
' అధికారులు లంచం అడిగితే.. చెట్టుకు కట్టి కొట్టండి..'

ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అధికారులు లంచం అడిగితే.. చెట్టుకు కట్టి కొట్టండని సూచించారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లిలో పేదలకు ఇళ్లు కార్యక్రమంలో వెంకటే గౌడ ఈ వ్యాఖ్యలు చేశారు.

' అధికారులు లంచం అడిగితే.. చెట్టుకు కట్టి కొట్టండి..'

ఇళ్ల పట్టాల కోసం ఎవరైనా అధికారులు లంచం అడిగితే.. చెట్టుకు కట్టేసి కొట్టాలని ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. బైరెడ్డిపల్లిలో పేదలకు ఇళ్లు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందించటమే ఏపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

ఎవరైనా అధికారులు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి లంచం అడిగితే.. చెట్టుకి కట్టేసి కొట్టి... తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తప్పు చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ అధికారులను కొట్టాలని.. ఎమ్మెల్యేనే వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది.

ఇవీచూడండి: నూతనంగా ఎన్నికైన భాజపా కార్పొరేటర్ కరోనాతో మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.