ETV Bharat / city

Corona cases: ఏపీలో కొత్తగా 4,169 కొవిడ్​ కేసులు, 53 మరణాలు

author img

By

Published : Jun 22, 2021, 6:05 PM IST

ఏపీలో నిన్నటితో పోల్చితే కరోనా కేసులు పెరిగాయి. ఇవాళ కొత్తగా 4,169 మంది కొవిడ్​ బారిన పడ్డారు. మరో 53 మంది మహమ్మారికి బలయ్యారు.

ap corona cases
ap corona cases

ఏపీలో కొత్తగా 4,169 కరోనా కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే వెయ్యికి పైగా కేసులు పెరిగాయి. వైరస్​ బారి నుంచి మరో 8,376 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 53,880 యాక్టివ్‌ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 74,453 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 743, పశ్చిమ గోదావరిలో 659, చిత్తూరులో 472 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 7, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు చొప్పున మరణించారు. కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు మృతి చెందారు.

ap corona cases
ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్​

ఇదీచూడండి: కరోనా వైరస్​పై 'కొవాగ్జిన్​' 77.8శాతం ప్రభావవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.