ETV Bharat / city

ఏపీలో కరోనా కల్లోలం.. కొత్తగా 5,963 కేసులు, 27 మరణాలు

author img

By

Published : Apr 19, 2021, 7:52 PM IST

corona cases in ap
ఏపీలో కరోనా కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 37,765 పరీక్షలు నిర్వహించారు. 5,963 కేసులు నిర్ధరణ కాగా.. 27 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 2,569 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 48,053 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లోనే 5,963 మందికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ కాగా.. 27 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48,053 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

జిల్లాల వారీగా కేసులు

గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1182 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు 938, శ్రీకాకుళం 893, తూర్పుగోదావరి 626, విశాఖ 565, నెల్లూరు 491, కర్నూలు 434, ప్రకాశం 280, కడప 189, కృష్ణా 171, అనంతపురం 156, విజయనగరం 19, పశ్చిమగోదావరి 19 కేసుల చొప్పున నమోదయ్యాయి.

corona cases in ap
నేటి కరోనా కేసుల వివరాలు

జిల్లాల వారీగా మరణాలు

గత 24 గంటల వ్యవధిలో కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఆరుగురు వైరస్ బారిన పడి మృతి చెందారు. చిత్తూరు 4, నెల్లూరు 4, గుంటూరు 2 , కడప 2, కర్నూలు 2, ప్రకాశం 2, శ్రీకాకుళం 2, విశాఖ 2, అనంతపురం 1 చొప్పున ప్రాణాలు విడిచారు.

ఇదీచదవండి: సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.